IND vs PAK: నేడే దాయాదుల సమరం

IND vs PAK: నేడే  దాయాదుల సమరం
X
జోరుమీదున్న టీమిండియాను పాక్ ఆపగలదా..

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు దాయాదుల సమరం మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసమని కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో నేడు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్‌ కు స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ ధరను ఏమాత్రం లెక్క చేయకుండా వేల కి.మీ. దూరం నుండి ప్రయాణించి తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు వస్తున్నారు. ఇక ఐర్లాండ్‌ తో జరిగిన మొదటి మ్యాచ్‌ లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన అదే దూకుడుతో మరోసారి పాకిస్థాన్ పనిపట్టాలని భాసిస్తుంది. ఇక మరోవైపు నిలకడలేమికి చిరునామాగా మారిన పాక్‌ టీమ్‌ఇండియాపై ఎలాగైనా విజయం సాధించాలని సిద్ధమైంది.

మెగాటోర్నీలో పాకిస్థాన్‌కు ఆదిలోనే అమెరికా టీమ్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. టోర్నీలో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే పాక్‌..భారత్‌పై గెలువక తప్పని పరిస్థితి నెలకొన్నది. షాహిన్‌ అఫ్రిది, హరిస్‌ రవూఫ్‌, మహ్మద్‌ ఆమిర్‌, యాసిర్‌ షాతో పాక్‌ పేస్‌ దళం బలంగా కనిపిస్తున్నా..భారత్‌ ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పిచ్‌పై రచ్చ: నసావు స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఐసీసీ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌లపై అటు ప్లేయర్లతో పాటు మాజీలు తమదైన శైలిలో తప్పుబడుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌, పంత్‌కు గాయాలు కాగా, పాక్‌తో పోరులో పిచ్‌ ఎలా స్పందిస్తున్నది అంచనాలకు అందకుండా ఉంది.

టీమిండియా: రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌

పాకిస్థాన్‌: బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌, ఉస్మాన్‌, జమాన్‌, ఆజమ్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌ లేదా ఆయూబ్‌, ఆఫ్రిది, నసీమ్‌, ఆమిర్‌, రవూఫ్‌ లు ఉండవచ్చని అంచనా.

Tags

Next Story