INDvsNZ: 108 పరుగులకే కుప్ప కూలిన కివీస్

X
By - Subba Reddy |21 Jan 2023 5:15 PM IST
రెచ్చిపోయిన భారత బౌలర్లు
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృభించారు. టాస్ గెలిచి బౌలింగ్ను ఎంచుకున్న భారత్ కివీ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆల్ఔట్ చేసింది.
మహ్మద్ షమీ తన ఇన్స్వింగ్తో మేజిక్ చేసి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ 1, శార్దూల్ థాకూర్ 1, హార్థిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 1, సుందర్ 2 వికెట్లతో న్యూజిల్యాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారత బౌలర్ల దాటికి రెండంకెల పరుగులు చేయడానిని కూడా కివీస్ తీవ్ర ప్రయాస పడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com