అన్ని రోజులు ఒకలా ఉండవు.. ఇకపై కుర్రాళ్లకే అవకాశం: ధోనీ

రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయి, 8 జట్ల ఐపిఎల్ 2020 పాయింట్ల పట్టికలో పడిపోయిన తరువాత, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్లు "ఎప్పుడూ మీ దారిలోనే ఉండవు" అని అన్నారు. దాని ఫలితం ఆట ప్రక్రియను అనుసరిస్తుందని ధోని పునరుద్ఘాటించారు.
39 ఏళ్ల ధోనీ రాబోయే మ్యాచ్లలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వగలనని సూచించాడు, ఎందుకంటే ఇది జట్టును మరింత బలంగా తయారుచేయడంలో సహాయపడుతుంది అని అన్నారు. 3 సార్లు ఐపి విజేత కెప్టెన్ కూడా ఈ సీజన్లో తన జట్టులో అవకాశం కల్పించలేదని ఒప్పుకున్నారు.
మన యువకులలో కొంతమంది నుండి మేము అంత స్పార్క్ చూడలేదు. బహుశా ముందు ముందు వారు మరింత మెరుగ్గా ఆడి వారి ప్రతిభను కనబరుస్తారని ఆశిస్తాను. ఒత్తిడి లేకుండా ఆడటం చాలా అవసరమని యువకులకు ధోనీ సూచించారు.
అబుదాబిలో సోమవారం ఆర్ఆర్తో జరిగిన ఆటలోని అన్ని విభాగాల్లో సిఎస్కె విఫలమైంది. 3 సార్లు ఛాంపియన్లు తమ 20 ఓవర్ల కోటాలో 125 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్ 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్సింగ్స్లో పిచ్ బౌలింగ్కు సహకరించింది. తర్వాత పరిస్థితి మారింది. పిచ్ను అర్థం చేసుకునే అవకావం ఉంటుందన్న ఆలోచనతోనే జడేజాను ముందు స్థానంలో బ్యాటింగ్లో దించాం. అయితే అప్పటి వరకు స్పిన్కు అనుకూలించిన పిచ్ తన స్వభావాన్ని మార్చుకుంది. అందుకే మేం ఎక్కువగా పేస్ బౌలింగ్కు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది అని ధోనీ అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com