MS Dhoni: పాకిస్థాన్ ఆటగాడికి ధోనీ స్పెషల్ గిఫ్ట్..

MS Dhoni: క్రికెట్ను ఎమోషన్గా భావించే వారు చాలామందే ఉంటారు. క్రికెట్ బరిలో దేశాల మధ్య వైరం ఎంతగా ఉంటుందో.. ఆట ముగిసిన తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం కూడా అలాగే ఉంటుంది. అందుకే శత్రు దేశ ఆటగాళ్లు కూడా మిత్రులవుతుంటారు. ఆ ఉద్దేశ్యంతోనే ఓ పాకిస్థాన్ క్రికెటర్కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ చేశాడు ఎమ్ ఎస్ ధోనీ.
కెప్టెన్ కూల్ ఎమ్ ఎస్ ధోనీని ఆరాధించే వారు చాలామంది ఉంటారు. క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇతర టీమ్ ఆటగాళ్లు, కెప్టెన్స్ కూడా ధోనీని ఎంతో ఇష్టపడతారు. ధోనీ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ అలాంటిది మరి. అయితే తనను అభిమానించే వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ చేయడం ధోనీకి అలవాటే. అలాగే పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రౌఫ్కు కూడా ఇచ్చాడు ధోనీ.
టీ20 వరల్డ్ కప్ సమయంలో ధోనీని కలిశాడు హారిస్. అప్పుడే ధోనీ అంటే తనకు అభిమానమని చెప్పాడు. ఆ వరల్డ్ కప్లో ఇండియాపై పాకిస్థాన్ గెలిచింది. అయితే ఆ విజయాన్ని గుర్తుపెట్టుకుని ధోనీ తన ఫ్యాన్ హారిస్ రౌఫ్కు గిఫ్ట్గా తన సీఎస్కే కెప్టెన్ జెర్సీని పంపించాడు. ఈ జెర్సీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The legend & capt cool @msdhoni has honored me with this beautiful gift his shirt. The "7" still winning hearts through his kind & goodwill gestures. @russcsk specially Thank you so much for kind support. pic.twitter.com/XYpSNKj2Ia
— Haris Rauf (@HarisRauf14) January 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com