RCB: మ్యాచ్‌లో ఓడినా సోషల్ మీడియాలో గెలిచిన ఆర్‌సీబీ.. ట్విటర్‌లో రికార్డ్..

RCB: మ్యాచ్‌లో ఓడినా సోషల్ మీడియాలో గెలిచిన ఆర్‌సీబీ.. ట్విటర్‌లో రికార్డ్..
RCB: ఐపీఎల్‌లో​తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్​ టైటాన్స్.. 15వ సీజన్​ కప్పును కొట్టేసింది.

RCB: ఐపీఎల్‌లో​తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ ​టైటాన్స్.. 15వ సీజన్​ కప్పును కొట్టేసింది. అయితే విజేతగా నిలిచినా గుజరాత్ టైటాన్స్ మాత్రం సోషల్​ మీడియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్టుగా స్థానం దక్కించుకోలేదు. ఈ సీజన్‌లో అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అలాగే అభిమానులు ఎక్కువగా చర్చించున్న ప్లేయర్లలో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.

రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఐపీఎల్​15వ సీజన్​ఉర్రూతలూగించింది. లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే ఫైనల్​చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన గుజరాత్​టైటాన్స్.. అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది. ఆరంభ సీజన్‌లో టైటిల్ గెలిచిన రాజస్థాన్​రాయల్స్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. మరోవైపు అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ -​2 మ్యాచ్‌లో ఆర్‌ఆర్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ట్విట్టర్‌లో మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా బెంగళూరు నిలిచింది. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

ట్విట్టర్‌లో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ టీమ్​మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారని ట్విట్టర్​అధికారికంగా వెల్లడించింది. 2022 ఐపీఎల్​సీజన్‌లో ఆర్సీబీపై అత్యధికంగా ట్వీట్లు​ చేశారు నెటిజన్లు. బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్​ రైడర్స్, రాజస్థాన్​రాయల్స్​జట్లు నిలిచాయి. ఇక నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్​ కోహ్లీ నిలవగా, తర్వాత స్థానాల్లో రోహిత్​ శర్మ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్​ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story