సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు!

X
By - TV5 Digital Team |28 Jan 2021 7:30 PM IST
ఛాతీలో నొప్పితో కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గతంలో వేసిన ఓ స్టంట్కు తోడుగా ఇప్పుడు మరో రెండు స్టంట్లు వేశారు.
ఛాతీలో నొప్పితో కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గతంలో వేసిన ఓ స్టంట్కు తోడుగా ఇప్పుడు మరో రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం దాదా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు గంగూలీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వచ్చారు. కాగా జనవరి మొదటి వారంలో గంగూలీకి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టెంట్ అమర్చారు. బుధవారం కాస్త అసౌకర్యంగా ఉండటంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com