Medak : ప్రయాణికురాలి గొలుసు చోరీకి ప్రయత్నించిన ఆటో డ్రైవర్

X
By - Vijayanand |22 April 2023 3:32 PM IST
మెదక్ జిల్లా నర్సాపూర్లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఆటో వెళ్తున్న మహిళను కత్తితో బెదిరించిన ఆటో డ్రైవర్.. ఆమె మెడలోని పుస్తెలతాడు చోరీకి యత్నించాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సదరు మహిళను ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి పంపించారు సునీతా లక్ష్మారెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com