Hyderabad : కల్తీ ఐస్క్రీం తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Hyderabad : కల్తీ ఐస్క్రీం తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ కేంద్రంగా కల్తీ తిను బండారాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతుంది. తాజాగా హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో కల్తీ ఐస్క్రీం తయారు చేస్తున్న ఓ కేంద్రాన్ని, తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫిరోజ్ అనే వ్యక్తి కుత్బుల్లాపూర్ లో కల్తీ ఐస్క్రీం తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. డిలీషియస్ ఐస్క్రీమ్ పేరుతో ప్రాణాంతక కెమికల్స్ ఉపయోగించి ఐస్క్రీమ్ తయారుచేస్తున్నట్లు తెలిపారు. దుర్గందమైన ప్రదేశంలో, పాడైపోయిన నీళ్లను ఐస్క్రీం తయారీలో వాడుతున్నట్లు చెప్పారు. నిర్వాహకుడు ఫిరోజ్ ను అరెస్ట్ చేసి.. 15లక్షల విలువైన సామాగ్రిని సీజ్ చేసినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story