వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి

X
By - Subba Reddy |16 May 2023 9:15 AM IST
మహబూబాబాద్ జల్లా మరిపెడలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది
మహబూబాబాద్ జల్లా మరిపెడలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది. మరిపెడకు చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు ఆమెకు చిన్న ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. దీంతో తీవ్ర రక్తశ్రావం జరిగింది. బ్లీడింగ్ అదుపు కాకపోవడంతో వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లగానే భాగ్యలక్ష్మిని చూసిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. డాక్టర్ల అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేసినా స్పందించక పోవడం వల్లే భాగ్యలక్ష్మి మృతి చెందిందని బంధువులు, కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com