ప్రైవేట్ బస్సును ఢీకొన్న ట్రక్కు .. నలుగురు మృతి
By - Vijayanand |23 April 2023 8:37 AM GMT
మహారాష్ట్రలోని పూణెలో తెల్లవారుజామున కార్గో ట్రక్కు, ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. పూణేలోని అంబేగావ్ ప్రాంతంలోని నర్హే గ్రామంలో పూణే-బెంగళూరు హైవేపై స్వామి నారాయణ్ ఆలయానికి ఆనుకుని ఉన్న నవాలే వంతెన ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కార్గో ట్రక్కు 31 చక్కెర బస్తాలను తీసుకువెళుతుండగా, లగ్జరీ బస్సును ఢీకొట్టింది, వాహనం బోల్తా పడింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి, మొత్తం ఏడు అగ్నిమాపక వాహనాలు, పిఎంఆర్డిఎ నుంచి ఒక రెస్క్యూ వ్యాన్ ఘటనా స్థలానికి చేరాయి. క్షతగాత్రులను రక్షించి వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com