CRIME: ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని మృతి

CRIME: ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని మృతి
X
ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు... చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

కడప జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన విఘ్నేష్ అనే యువకుడు శనివారం విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్‌ శనివారం పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు విఘ్నేశ్‌ ను పోలీసులు గంటల వ్యవధిలో శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.


అసలేం జరిగింది..

కడప జిల్లా బద్వేల్‌ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన వాడు కావడంతో విఘ్నేశ్‌తో పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కొన్నేళ్ల నుంచి నిందితుడు విఘ్నేశ్,,, యువతి వెంట పడి వేధిస్తున్నాడు. కొన్ని నెలల కిందట యువకుడికి వివాహం అయినట్లు తెలుస్తోంది. అయినా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ, తనను పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడాలని, రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేశాడు. అతడికి మరోసారి సర్దిచెబుతామని ఇంటర్ విద్యార్థిని ఆటోలో వెళ్లింది. విద్యార్థినిని.. అతడు నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చంద్రబాబు ఆగ్రహం

విద్యార్థినిపై హత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడారు. నిందితుడిని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8వ తరగతి నుంచే తమ కుమార్తెను ప్రేమ పేరుతో నిందితుడు విఘ్నేశ్ వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కొన్ని నెలల కిందట అతడికి వివాహమైనా కూడా వేధింపులు ఆపలేదన్నారు. చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రప్పించి తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో జిల్లా జడ్జి శనివారం నాడు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. భార్య వద్దు, నువ్వే కావాలంటూ వేధించాడని.. బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లికి నిరాకరించడంతో పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటినట్లు విద్యార్థిని స్టేట్మెంట్ ఇచ్చింది.

Tags

Next Story