అనపర్తిలో 25కిలోల గంజాయి పట్టివేత

X
By - Subba Reddy |16 May 2023 12:15 PM IST
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గంజాయిని తరలిస్తున్న, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గంజాయిని తరలిస్తున్న, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుండి సుమారు 25కిలోల గంజాయితో పాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి పరారవుతున్న వారిని వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. కొంతకాలంగా గోరింటకు చెందిన అన్నదమ్ములు గంటా వీర్రాజు, గంటా స్వామి, తన స్నేహితుడు విశాల్తో కలిసి, గంజాయిని తమిళనాడులో విక్రయిస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com