Medchal : మేడ్చల్లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు గల్లంతు..

X
By - Sai Gnan |28 Sept 2022 7:21 PM IST
Medchal : నాటకం చెరువులోకి ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు
Medchal : మేడ్చల్ జిల్లా చిర్యాల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నాటకం చెరువులోకి ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న 9 మంది విద్యార్థులు టెంపుల్కు వచ్చారు. హరిహరన్, ఉబేద్ అనే విద్యార్థుల బర్త్డే వేడుకులు కావడం సరదాగా బయటకి వచ్చారు. విద్యార్థులు నాటకం చెరువులోకి దిగారు. దీంతో హరిహరన్, ఉబేద్, బాలాజీ అనే విద్యార్థులు గల్లంతు అయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం స్థానికుల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com