Eluru : ఏలూరులో పిడుగుపడి నలుగురు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

X
Eluru : ఏలూరు జిల్లాలో పిడుగుపడి నలుగురు చనిపోయారు. లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో పిడుగుపాటుకు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు, గాయపడిన వాళ్లు వలస కూలీలని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి జామాయిల్ కటింగ్ కోసం ఏడుగురు కూలీలు బోగోలు వచ్చారు. రాత్రి గుడారాల్లో నిద్రపోతున్న సమయంలో పిడుగులు పడాయి. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారు. గాయపడిన ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
