Viveka Murder Case : నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా నిందితులు
By - Vijayanand |28 April 2023 8:44 AM GMT
వివేకా హత్య కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను విచారణలో భాగంగా కోర్టులో హాజరుపర్చారు. అటు.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోర్టుకు వచ్చారు. విచారణను వచ్చే నెల 2కు సీబీఐ కోర్టు వాయిదా వేయడంతో.. నిందితులను తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి ప్రధాన నిందితుడు. నిన్ననే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. మే5 వరకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గంగిరెడ్డి లొంగిపోకపోతే.. సీబీఐ అరెస్ట్ చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడు లొంగిపోతారనేది ఆసక్తికరంగా మారంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com