Gold Smuggling : సినీ ఫక్కీలో 679 గ్రాముల బంగారం పట్టివేత

X
By - Vijayanand |5 May 2023 1:53 PM IST
దుబాయ్ నుంచి బంగారాన్ని భారత్ కు స్మగ్లింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతీ వారంలో ఒక్కరైనా బంగారాన్ని అక్రమంగా భారత్ లోకి తరలిస్తూ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోతున్నారు. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడు 42 లక్షల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు.
ఓ ప్రయాణికుడు 679గ్రాముల విలువైన బంగారాన్ని పేస్టుగా మార్చి క్యాప్సిల్స్ గా మార్చాడు. వాటిని శరీరంలోని అంతర్భాగంలో అమర్చుకున్నాడు. నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు కస్టమ్స్ అధికారులు. నిందితున్ని హాస్పిటల్ కు తరలించి మలద్వారంలో దాచిపెట్టిన బంగారాన్ని వెలికితీసి అరెస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com