Warangal: తెల్లవారితే నిశ్చితార్థం.. అంతలోనే మృత్యుఒడిలోకి వరుడు..

Warangal: తెల్లారితే నిశ్చితార్థం.. బట్టలు కొనేందుకు నగరానికి వచ్చిన ఓ యువకుడు పాతభవనం కుప్పకూలటంతో మృత్యువాతపడ్డాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎడతెెరిపిలేని వానలతో వరంగల్ నగరంలోని మండి బజార్లో.. పాతభవనం కూలిపోయింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా. ఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.. దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన వృద్ధుడు తిప్పారావు మండి బజార్లోని నిర్మాణ భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పనిచేస్తున్నారు.
వారిద్దరూ భవనం పరిసర ప్రాంతంలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే సలీమా కుమారుడు ఫిరోజ్... తొర్రూరు మండలం మాటేడులో పనిచేసుకుంటూ ఉంటున్నాడు. ఫిరోజ్కు వివాహం నిశ్చయం కావటంతో..ఇవాళ నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టుకున్నారు. అందుకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు వరంగల్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు పాత భవనం గోడ కూలి మృతి చెందిన ఇద్దరిలో ఫిరోజ్ ఉండటం.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com