Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే అత్యాచారం చేశాడు

Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే అత్యాచారం చేశాడు
Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే... అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బిబిపేట్‌లో చోటు చేసుకుంది.

Nizamabad : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే... అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బిబిపేట్‌లో చోటు చేసుకుంది. తెలిసినవాడే కదా అని... శిరీష అనే మహిళ గణేష్‌ అనే వ్యక్తికి రెండున్నర లక్షలు అప్పు ఇచ్చింది. తిరిగి తన డబ్బులు ఇవ్వాలని అడిగితే... ఆమెపైనే అత్యాచారం చేసి, హత్య చేయడానికి ప్రయత్నించాడు. శిరీషను గ్రామ శివారులోని పొదల్లోకి తీసుకెళ్లి... దారుణంగా చితకబాదాడు. కళ్లపై కొట్టి హింసించాడని... స్పృహ కోల్పోయాక.. తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. తనను చంపేందుకు ప్రయత్నించిన గణేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు శిరీష్‌ డిమాండ్‌ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story