ఉద్యోగం పోవడంతో దొంగగా మారిన టెక్కి.. అరెస్ట్

బెంగళూరు టెక్కీ, 26, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత దొంగగా మారింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్టాప్లను దొంగిలించినందుకు 26 ఏళ్ల మాజీ ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
నోయిడాకు చెందిన జాస్సీ అగర్వాల్ ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసింది. కానీ కోవిడ్ సమయంలో ఆమె ఉద్యోగం కోల్పోయింది.
ఆ తర్వాత పీజీల నుంచి ల్యాప్టాప్లు, గాడ్జెట్లను దొంగిలించి తన స్వగ్రామంలో బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ చివరికి 'పూర్తికాలపు దొంగ'గా మారిపోయింది. జాస్సీ ఖాళీగా ఉన్న పీజీ గదుల్లోకి ప్రవేశించి ఛార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్లను తస్కరించేది. ల్యాప్టాప్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయని పీజీ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మార్చి 26న జాసీని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.10-15 లక్షలకు పైగా విలువైన 24 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. "జాస్సీ చాలా ప్రాంతాలలో ఇలా చేస్తోంది. ఇది కొంతకాలంగా జరుగుతోంది. ఆమె పీజీలలోకి ప్రవేశించి, దొంగిలించిన గాడ్జెట్లతో తిరిగి వెళుతున్న దృశ్యాలను మా క్రైమ్ బ్రాంచ్ CCTV భద్రపరిచింది," అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com