విశాఖ శ్వేత మృతి కేసులో ట్విస్ట్
![విశాఖ శ్వేత మృతి కేసులో ట్విస్ట్ విశాఖ శ్వేత మృతి కేసులో ట్విస్ట్](https://www.tv5news.in/h-upload/2023/04/26/953749-swetha.webp)
విశాఖ బీచ్లో శవమై కనిపించిన గర్భిణీ శ్వేత మృతిలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్ధనగ్నంగా కనిపించడంతో.. ఆమెదీ హత్య, లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే భర్త, అత్త మామల వేధింపుల వల్లే శ్వేత చనిపోయిందంటూ మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్వేత బయటకు వెళ్లడానికి ముందు సూసైడ్ నోట్ రాసిందని.. భర్త గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసిందంటున్నారు. గతేడాది ఏప్రిల్ 15న పెళ్లి చేశామని చెప్పారు.
విశాఖ శ్వేత మృతి కేసులో ట్విస్ట్
శ్వేత సూసైడ్ లెటర్ రాసినట్లు గుర్తింపు
లెటర్లో భర్త మణికంఠ పేరును ప్రస్తావించిన శ్వేత
భర్త, అత్తమామల వేధింపుల వల్లే శ్వేత చనిపోయింది- తల్లిదండ్రులు
శ్వేత అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com