Uttar Pradesh : పబ్లిక్ టాయిలెట్లో మహిళ పై అత్యాచారం

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది.. పబ్లిక్ టాయిలెట్లో మహిళ పైన అత్యాచారం జరిగింది... ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి అహ్మదాబాద్కు రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్కి వచ్చింది. భోజనం తీసుకొచ్చేందుకు ఆమె భర్త బయటకు వెళ్ళాడు.. ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరికి ఓ నిందితుడు వెళ్ళాడు.. తన వద్ద టాయిలెట్ కీస్ ఉన్నాయని, అవసరమైతే వాడుకోవచ్చునని చెప్పాడు. అతని మాటలు నమ్మి కీస్ తీసుకున్న మహిళ.. టాయిలెట్ లోకి వెళ్ళింది. అప్పుడే లోపలికి వెళ్ళిన నిందితుడు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.. భార్యను రక్షించిన ఆమె భర్త పోలీసులకు సమాచారం అందించాడు.. భాదితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com