Nellore : కుటుంబ కలహాలతో ఎస్సై భార్య ఆత్మహత్య..!

Nellore :  కుటుంబ కలహాలతో ఎస్సై భార్య ఆత్మహత్య..!
Nellore : కుటుంబ కలహాలతో రైల్వే ఎస్సై భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Nellore : కుటుంబ కలహాలతో రైల్వే ఎస్సై భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలేనికి చెందిన చిక్కా నరసింహారావుకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన దుర్గాభవాని(29)తో పదేళ్ల కిందట వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఐతే మంగళవారం ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపంతో దుర్గాభవాని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నరసింహారావు చెబుతున్నాడు.. కానీ దుర్గాభవానిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం దుర్గాభవానిని కొంతకాలం నుంచి అత్తమామలు వేధిస్తున్నారని, తట్టుకోలేక గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. అంతేకాకుండా చనిపోయే ముందు రోజు వీడియో కాల్‌లో మాట్లాడిందని ఏడుస్తూ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story