Accident : డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Accident : డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
డీసీఎం టైర్‌ పంక్చర్ అవ్వడంతో రోడ్డుపక్కన ఆపి టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది

జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. డీసీఎం టైర్‌ పంఛర్ కావడంతో రోడ్డుపక్కన ఆపి టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తో పాటు కారులో ఉన్న చిన్నారి కూడా చనిపోయింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story