Alwar Lynching Case: రక్బర్ ఖాన్ హత్య కేసులో నలుగురికి ఏడేళ్ల జైలు
2018లో గో-సంరక్షక గుంపు దాడిచేయగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదవగా ఈ రోజు నిందితులకు శిక్షను విధించింది కోర్టు. హర్యానాకు చెందిన రక్బన్ ఖాన్ (29) అనే వ్యక్తిని జులై 21, 2018న గోవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న నెపంతో అతనిపై దాడిచేశారు గో రక్షకులు. దాడిలో గాయపడిన రక్బర్ ఖాన్ 2018లో మరణించాడు. ఈ కేసులో ఏడుగురికి జైలు శిక్షను విధించింది కోర్టు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్త నవల్ కిషోర్ శర్మ అనే వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించింది.
2018లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో రక్బర్ ఖాన్ ఆవుల అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో కొట్టి చంపారు. రక్బర్, తన స్నేహితుడు అస్లామ్తో కలిసి అల్వార్ జిల్లాలోని రామ్గఢ్ గుండా ప్రయాణిస్తుండగా, ఒక గుంపు అతనిని కొట్టి చంపింది. పోలీసులు ఛార్జిషీట్లో, నరేష్ శర్మ, విజయ్ కుమార్, ధర్మేంద్ర యాదవ్ మరియు పరమజిత్ సింగ్ అనే నలుగురు నిందితులను మొదట పేర్కొన్నారు. నావల్ కిషోర్ శర్మ తరువాత అరెస్టు చేయబడి, జూలై 20, 2018న గుంపును ప్రేరేపించినట్లు అభియోగాలు మోపారు.
ఈ కేసులో మరో నలుగురు నిందితులు దోషులుగా నిర్ధారించబడి, ఏడేళ్ల జైలు శిక్ష విధించగా శర్మను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హర్యానాకు చెందిన రక్బర్ ఖాన్ (29) ను జూలై 21, 2018న గోసంరక్షకుల గుంపు కొట్టి చంపింది. ఆవుల అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో అతనిపై దాడి చేశారు. ఆ తరువాత అతను అనేక గాయాలతో మరణించాడని పోస్ట్మార్టం నివేదిక పేర్కొంది. రక్బర్ శరీరంపై 12 గాయాల గుర్తులు ఉన్నాయి. అధికంగా అంతర్గత రక్తస్రావం కారణంగా అతను మరణించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com