AP : సీబీఐ ముందుకు మరోసారి అవినాష్ రెడ్డి

AP :  సీబీఐ ముందుకు మరోసారి అవినాష్ రెడ్డి

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్నారు. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ నోటీసులిచ్చి, హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ అవినాష్‌రెడ్డి... ఇవాళ 3 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. ఈ కేసు.... తెలంగాణకు బదీలీ అయ్యాక అవినాష్‌ రెడ్డిని రెండోసారి ప్రశ్నించనుంది సీబీఐ. ఈ కేసులో అవినాష్‌ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని భావిస్తున్న సీబీఐ...... ఆయన్ను సుధీర్ఘంగా ప్రశ్నించనుంది. ఇప్పటికే ఏ2 సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ కౌంటర్‌పై సంచలన విషయాలు వెల్లడించింది సీబీఐ.

హత్య జరిగిన రోజు నిందితులంతా భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని కౌంటర్‌లో పేర్కొంది. అంతేకాదు... ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని వెల్లడించింది. హత్య కుట్ర మొత్తం అవినాష్‌రెడ్డికి ముందే తెలుసని.... ఘటనాస్థలంలో సాక్ష్యాలను, ఆధారాలను చెరిపివేయడంలో అవినాష్‌ పాత్ర ఉందని చెబుతోంది సీబీఐ. అవినాష్‌రెడ్డితో పాటు తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయానికి సంబంధించి ఓ అంచనాకు వచ్చిన సీబీఐ... ఇవాళ ఆయన్ను సుధీర్ఘంగా ప్రశ్నించనుంది. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వివేక హాత్య చేయించింది అవినాష్‌రెడ్డే అని భావిస్తున్న సీబీఐ..... 40 కోట్ల డీల్‌పై ఆయన్ను ప్రశ్నలవర్షం కురిపించే అవకాశాలున్నాయి. ఇవాళ విచారణ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీబీఐ అధికారులు.......

ఇవాళ జరిగే విచారణ కోసం అవినాష్‌రెడ్డి...... ఇప్పటికే పులివెందుల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 28న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. అప్పట్లో విచారణలో కాల్‌డేటాపై దృష్టి సారించారు. తర్వాత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను కడపకు పిలిపించి విచారించారు. ఇదే కేసులో నిందితుడైన సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లో సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తూ వివేకా హత్యకు పన్నిన కుట్ర గురించి సమగ్రంగా వివరించింది.

ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్‌ రెడ్డిని విచారించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో ఎంపీతో పాటు ఆయన తండ్రి పాత్రను ప్రస్తావించింది. ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని నిన్నే విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వగా.. ఆయన హాజరు కాలేదు. తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న కారణంగా రాలేనని సమాధానం ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడులోని ఓ క్షేత్రానికి యాత్రకు వెళ్లినట్లు సమాచారం.

Next Story