ఎస్బీఐ ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దొంగలు
By - Nagesh Swarna |5 Feb 2021 3:30 AM GMT
మరో ఏటీఎంతో పాటు జ్యువెలరీ షాపులో చోరీకి యత్నించారు దొంగలు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్ చౌక్లో చోటుచేసుకుంది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లో దాదాపు 30 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దేవిచంద్ చౌక్లోని మరో ఏటీఎం, జ్యువెలరీ షాపులో చోరీకి యత్నించారు దొంగలు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com