Bengaluru: బానెట్పై వ్యక్తి.. ఈడ్చుకెళ్లిన మహిళ...

కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని కారు బానెట్పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళా డ్రైవర్. ఈ ఘటన బెంగళూరులోని భారతీనగర్లో చోటుచేసుకుంది.
స్విఫ్ట్, టాటా నిక్సన్ కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. టాటా నిక్సన్ కారును ప్రియాంక అనే మహిళ నడుపుతుండగా... స్విఫ్ట్ కారును దర్శన్ నడుపుతున్నాడు. రెండు కార్లు ఢీ కొన్న తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగారు.
ఐతే గొడవ మధ్యలో దర్శన్కు మిడిల్ ఫింగర్ చూపించిన ప్రియాంక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ప్రియాంక ఆపకుండా ముందుకు వెళ్లింది. దీంతో బానెట్పైకి ఎక్కి కారు ఆపేందుకు అతడు యత్నించాడు. దీంతో దర్శన్ బానెట్పై ఉండగానే కిలోమీటర్కు పైగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com