Karnataka : బీదర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి..

Karnataka : బీదర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి..
Karnataka : కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్‌ హైవేపై కంటైనర్‌ను కారు ఢీకొట్టింది.

Karnataka : కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్‌ హైవేపై కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మృతులంతా హైదరాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

కర్ణాటకలోని గంగాపూర్‌లో దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. బీదర్‌లోని బంగూర్‌ సమీపంలో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. మృతుల్లో సైబర్‌ క్రైమ్‌ కానిస్టేబుల్‌ గిరిధర్‌ ఉన్నారు. డ్రైవర్‌ జగదీష్‌తో పాటు ప్రియ, అనిత, మహేక్‌ మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story