Chhattisgarh: ముగ్గురు జవాన్ల ప్రాణం తీసిన మరో జవాన్.. ఎందుకంటే..
Chhattisgarh (tv5news.in)
Chhattisgarh: తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు తీశాడో జవాన్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగంపల్లి బేస్క్యాంప్లో జవాన్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయిన ఓ జవాను కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో బిహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్కు చెందిన రాజుమండల్ అనే ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారు.
బేస్క్యాంప్లో ఫైరింగ్ జరగడంతో సీఆర్పీఎఫ్ దళాలు అలర్ట్ అయ్యాయి. కాల్పులకు పాల్పడిన జవాన్ను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి సెలవుల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం అందుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com