DEAD: తిరుచానూరులో విషాదం.. మహిళ మృతి

X
By - Sathwik |4 Nov 2024 8:30 AM IST
తిరుపతి రూరల్ తిరుచానూరు పరిధిలోని శిల్పారామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రాస్ వీల్లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా విరిగిపోయి కుప్పకూలింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మహిళ సుబ్బారెడ్డి నగర్కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో లోకేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com