పేస్టు రూపంలో 1761 గ్రాముల బంగారం.. అడ్డంగా దొరికిపోయిన కేరళ వాసి
By - Subba Reddy |19 May 2023 5:45 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి ఎమ్మిరేట్స్ విమానం లో హైదరాబాద్ వచ్చిన కేరళ వాసి వద్ద 1761 గ్రాముల బంగారం పట్టుకున్నారు. దీని విలువ సుమారు 1.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బంగారాన్ని పేస్టుగా మార్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు నిందితుడు. నిందితుడిపై అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com