మీకు లోన్ సాంక్షన్.. క్లిక్ చేస్తే రూ. 80 వేలు మాయం

X
By - Subba Reddy |27 May 2023 10:00 AM IST
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సైబర్ నేరగాళ్ల చేతివాటం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సైబర్ నేరగాళ్ల చేతివాటం.పర్సనల్ లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. లోన్ పేరుతో బాధితుడి సెల్ ఫోన్ కి మెసేజ్ పంపిన నేరగాళ్లు. లోన్ సాంక్షన్ అయ్యిందని మరో ఫోన్ చేశారు. లోన్ అమౌంట్ రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు, GST చెల్లించాలని మరో లింక్ పంపారు. దీంతో లింక్ పై బాధితుడు క్లిక్ చేయగానే అకౌంట్ లో నుంచి 80 వేల రూపాయలు మాయమయ్యాయి. గమనించిన సదరు వ్యక్తి సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com