Guntur: తల్లితో వివాహేతర సంబంధం.. కోపంతో అతడి మర్మాంగాన్ని కోసిన కూతురు..

X
By - Divya Reddy |3 May 2022 10:00 AM IST
Guntur: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది.
Guntur: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. గుంటూరు జిల్లా తెనాలిలోని శివాజీ చౌక్లో ఈ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పని కోసం తెనాలికి వలస వచ్చాడు. ఈ క్రమంలో ఐతానగర్కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ కలిసి సినిమా చూసొచ్చి, మందు తాగి, ఆమె ఇంటి మేడ పైనే పడుకున్నారు. తన తల్లితో సంబంధం పెట్టుకున్నాడంటూ ఆమె కూతురు.. మరో యువకుడితో కలిసి, రామచంద్రారెడ్డితో గొడవ పడి, బ్లేడ్తో మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడిని తెనాలి ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com