పుట్టిన రోజు వేడుకల కోసం డిగ్రీ విద్యార్థినిని లాడ్జ్కి తీసుకెళ్లి..

హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు.. స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని పుట్టిన రోజు వేడుకలకని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కేక్లో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 19 ఏళ్ల యువతి.. సికింద్రాబాద్లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. తమ ఇంటి పరసరాల్లో ఉండే జోసెఫ్, రాము, నవీన్ ఆమెకు స్నేహితులయ్యారు. ఈ నెల 5న ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లగా.. పుట్టిన రోజు వేడుకల కోసం KPHBలోని ఓ లాడ్జ్కి తీసుకెళ్లారు. పథకం ప్రకారం కేకుపై మత్తుమంది చల్లిన యువకులు.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు.
అత్యాచార ఘటన తర్వాత.. బాలిక అస్వస్థతకు గురైంది. ఈ నెల 11న ఆపస్మారకస్థితిలో వెళ్లగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. వారు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి సంబంధించి ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com