Delhi : భవనంపై వేలాడి.. కిందకు దూకి, కాలు విరగ్గొట్టుకున్నాడు

Delhi : భవనంపై వేలాడి.. కిందకు దూకి, కాలు విరగ్గొట్టుకున్నాడు

నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఇంటి భవనం రెండో అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనలో అతని కాలు విరిగింది. దూకబోయే ముందు బిల్డింగ్ కు వేలాడి అరుస్తూ చుట్టుపక్కల వారికి ఇబ్బందిని కలుగజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 37 ఏళ్ల ఎన్‌డినోజువోగా గుర్తించబడిన వ్యక్తి, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని నివాస భవనం యొక్క అంతస్తులలో ఒకదాని నుండి వేలాడుతూ అరుస్తూ కనిపించాడు. అతను బాల్కనీ యొక్క రెయిలింగ్ నుంచి వేలాడాడు. అనతరం బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ ఘటన మార్చి 18 న జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఎన్‌డినోజువో భవనం నుంచి పడిపోయిన తర్వాత, ఒక వ్యక్తి అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. సహాయం చేయడానికి వెళ్లిన వ్యక్తిని పట్టుకుని ఇబ్బందులకు గురిచేశాడు. ఎట్టకేలకు స్థానికులు అతన్ని విడిపించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నైజీరియా దేశస్థుడిని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌డినోజువోకు కాలు విరిగినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియాలో తన తల్లిదండ్రుల మృతి గురించి తెలుసుకున్న తర్వాత తాను భవనంపై నుంచి దూకినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. విషాద వార్త తెలుసుకున్న తర్వాత తాను షాక్‌కు గురయ్యానని, డిప్రెషన్‌లో ఉన్నానని పేర్కొన్నాడు.

Next Story