Delhi: రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు...

దేశ రాజధానిలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ ను ఓ దుండగుడు వేధించాడు. ఢిల్లీలో మహిళల భద్రతపై రియాలిటీని చెక్ చేయడానికి స్వాతి పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా... తన టీంతో సీక్రెట్ గా ఆపరేషన్ నిర్వహించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు... ఢిల్లీ వీధుల్లో స్వాతి నడుచుకుంటూ వెళ్తుండగా... హరీష్ చంద్ర (47) అనే వ్యక్తి స్వాతిని వేధించాడు. ఆమెను కారులో ఎక్కించుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో హరీష్ చంద్ర తాగి ఉన్నట్లు స్వాతి తెలిపారు.
స్వాతిని బలవంతంగా కారులో ఎక్కించడానికి హరీష్ ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. స్వాతి చేయిని కారు డోర్ కు బంధించి 15 మీటర్లు లాక్కెళ్లాడు. మలివాల్ బృందం కొంతదూరంలోనే ఉండటంతో వెంటనే దుండగుడిని పట్టుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో మహిళల భద్రతను తెలుసుకునేందుకే తాము ఈ ఆపరేషన్ ను చేపట్టినట్లు స్వాతి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com