Delhi : కుళ్లిన విదేశీయురాలి మృతదేహం లభ్యం

Delhi : కుళ్లిన విదేశీయురాలి మృతదేహం లభ్యం
శుక్రవారం సాయంత్రం గీతా కాలనీలోని అండర్ పాస్ వద్ద కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు

కుళ్లిపోయిన స్థితిలో ఓ విదేశీ మహిళ మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం గీతా కాలనీలోని అండర్ పాస్ వద్ద కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. షహదారా డీసీపీ రోహిత్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పాస్ పోర్ట్, డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన డీసీపీ తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

నోయిడాలోని మరో ఘటనలో, మానవ శరీర భాగాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలోని ఇండస్ట్రియల్ ఏరియా సెక్టార్ 8 లో శుక్రవారం ఉదయం 10గంటలకు గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలను ఓ మురికి కాలువలో కనుగొన్నట్లు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్లు నోయిడా డిప్యుటీ కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు. ఫారెన్సిక్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించిందని తెలిపారు. శరీర భాగాలను పోస్ట్ మార్టమ్ కు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story