Delhi : యువతిని కొట్టి లాక్కెల్లిన దుండగులు

Delhi : యువతిని కొట్టి లాక్కెల్లిన దుండగులు

ఢిల్లీలో వరుస నేరాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహిళను కొట్టి క్యాబ్ లో ఎక్కించుకు వెళ్లారు ఇద్దరు యువకులు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీలోని మంగోల్ పురిలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం రాత్రి ఓ మహిళను ఓ యువకుడు కొట్టి క్యాబ్ లో ఎక్కించాడు. అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. స్థానికులు, క్యాబ్ డ్రైవర్ మహిళను కొడుతున్న వ్యక్తిని అడ్డుకోలేదు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ పోలీస్ కమిషనర్. క్యాబ్ నెంబర్ ఆదారంగా కారు ఓనర్ హర్యానా లోని గురుగ్రామ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్యాబ్ యజమానిని వెతుక్కుంటూ పోలీసు బృందం వెళ్లింది.


శనివారం రాత్రి 11.30 గంటలకు గురుగ్రామ్ లోని ఇఫ్కో చౌక్ లో క్యాబ్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తున్నారు. క్యాబ్ మాత్రం రోహిణి నుంచి వికాస్ పురికి ఉబర్ యాప్ ద్వారా బుక్ చేయబడిందని తెలిపారు. మార్గమధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story