Delhi : మహిళపై యాసిడ్ దాడి

X
By - Vijayanand |24 March 2023 6:45 AM IST
మహిళపై ఓ దుండగులు యాసిడ్ తో దాడిచేశారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ లో జరిగింది. 35 ఏళ్ల మహిళ మెడపై, చేతిపై కాలిన గాయాలయ్యాయి. మహిళ బట్టలు కూడా కాలిపోయాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భరత్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితురాలు తన దుకాణంలో కూర్చుని ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెపై కెమికల్ లాంటి పదార్ధాన్ని విసిరాడు. అయితే అది యాసిడ్ లేక మరేదైన విషపూరిత రసాయణమా అన్న విషయాన్ని పోలీసులు దృవీకరించలేదు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com