Delhi : బైక్ తగిలినందుకు డెలివరీ బాయ్ ను కొట్టారు

Delhi : బైక్ తగిలినందుకు డెలివరీ బాయ్ ను కొట్టారు

ఢిల్లీలో ఓ డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. ఢిల్లీలోని సుల్తాన్ పురిలో గురువారం ఈ ఘటన జరిగింది. కైలాష్ విహార్ కు చెందిన సాహిల్ (30) అనే డెలివరీ బాయ్ తన బైక్ పై వెళ్తుండగా అనుకోకుండా మరో బైక్ ను రాసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఎదుటివారి బైక్ కు గీతలు పడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎదుటి వాళ్ల బైక్ స్వల్పంగా పాడవడంతో సాహిల్ పై చేయిచేసుకున్నారు. సాహిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అవతలి వాళ్లు కర్రలతో కొట్టారని సాహిల్ ఆరోపించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగింది. సాహిల్ ను మంగోల్ పురిలోని ఎస్ జిఎం హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సాహిల్ కోలుకున్నాడని... కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు వ్యక్తులు... సులేందర్, అతని భార్య కవిత, సుమిత్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 341 (తప్పు నిర్బంధం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story