Delhi Crime: స్నేహం వద్దన్నందుకు... తూట్లు పొడిచాడు..

Delhi Crime: స్నేహం వద్దన్నందుకు... తూట్లు పొడిచాడు..
స్నేహం నిరాకరించినందుకు యువతిపై కత్తితో దాడి; విచక్షణారహితంగా పొడిచిన సుఖ్‌విందర్‌: నిలకడగానే యువతి పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఢిల్లీ ఆదర్శ్‌నగర్‌లో తనతో ఫ్రెండ్‌షిప్‌ చేయడంలేదని ఓ యువతిని కిరాతకంగా పదేపదే పొడిచాడో కిరాతకుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల యువతి 22ఏళ్ల సుఖ్‌విందర్‌ సింగ్‌ అనే యువకుడు ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా స్నేహితులు. కొన్ని రోజుల క్రితం వారిద్దరి మధ్య స్నేహం చెడింది. ఆ యువతి అతనితో మాట్లాడం మానేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన సుఖ్‌విందర్‌ సింగ్‌ సోమవారం ఆ యువతిపై కత్తితో అతికిరాతకంగా పదే పదే పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

స్థానికులు ఆ యువతిని జహంగీర్‌ పురిలోని బాబు జగ్జీవన్‌ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సుఖ్‌విందర్‌ సింగ్‌ను పోలీసులు మంగళవారం అంబాలలో అదుపులోకి తీసుకొని 307 అటెంప్ట్‌ టూ మర్డర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story