MURDER: ఢిల్లీలో శ్రద్దావాకర్‌ తరహాలో మహిళ హత్య

MURDER: ఢిల్లీలో శ్రద్దావాకర్‌ తరహాలో మహిళ హత్య
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్య.... మహిళ శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.... రెండు కవర్లలో శరీర భాగాలు

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్య జరిగింది. గత ఏడాది శ్రద్ధావాకర్‌ హత్య తరహాలోనే మహిళను అతి కిరాతంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైఓవర్ సమీపంలో పలు దిక్కుల్లో మహిళ శరీర భాగాలను గుర్తించారు. మహిళ వయస్సు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో కవర్లు చుట్టి పడేసిన మహిళ శరీర భాగాలను గుర్తించామని... వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఒక కవర్లో శరీరం, తల మరొక కవర్లో ఇతర భాగాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు . మహిళ ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


గత ఏడాది ఇరవై ఆరేళ్ల శ్రద్ధ వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. కొద్దికాలంగా సహజీవనం సాగిస్తున్న వీరు తరచు గొడవ పడేవారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేసినట్టు చెబుతున్నారు. నేరం బయటకు పొక్కకుండా శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ వాకబు చేయడంతో అఫ్తాబ్ నేరం బయటపడింది. అఫ్తాబ్‌ను పోలీసు అరెస్టు చేయడంతో ఈ ఘటన సంచలనమైంది. ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో తాను శ్రద్ధను హత్య చేసినట్టు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ పరీక్షలో అఫ్తాబ్ అంగీకరించాడు.

Tags

Read MoreRead Less
Next Story