వికటించిన వైద్యం.. ఒకే కుటుంబంలో 8 మంది మృతి.. !

X
By - TV5 Digital Team |6 May 2021 4:30 PM IST
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందుతాగడం వల్లే మరణాలు సంభవించినట్లుగా పోలీసులు చెప్పారు. ఈ మందును వారికి ఇచ్చిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. కరోనా నివారణ కోసమే వారు ఈ ఔషధాన్ని తీసుకున్నారని పోలీసులు తెలిపారు.వీళ్లంతా డ్రోసెరా 30 అనే ఔషధం తీసుకోగా.. అందులో 91 శాతం నాటుసారా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ డ్రెసెరా 30 ఔషధాన్ని అనేక అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. గొంతునొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల నివారణ కోసం దీనిని ఉపయోగిస్తారు. అటు మృతుల్లో నలుగురికి రాత్రి అంత్యక్రియలు జరగడంతో ఈ కేసు అనుమానాస్పదంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com