దారుణం.. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా ఆత్మహత్యచేసుకున్న దంపతులు

దారుణం.. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా ఆత్మహత్యచేసుకున్న దంపతులు

పశ్చిమ గోదావరిజిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో దారుణం జరిగింది. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన పరుషురాం, సావిత్రిగా గుర్తించారు. హైమావతి అనే మహిళలకు దంపతులు 46 లక్షలు అప్పు ఇచ్చారు. ఈ మధ్య హైమావతి డబ్బుతో పరార్ కావడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దంపతులు ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.


Tags

Next Story