Hyderabad Crime News : గ్రామస్తుల పై మాజీ మంత్రి కుమారుడు దాడి.. భూవివాదమే కారణమా..?
By - Sai Gnan |28 Sep 2022 11:15 AM GMT
Hyderabad Crime News : కేంద్ర మాజీమంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్పై పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది
Hyderabad Crime News : కేంద్ర మాజీమంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్పై పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మామిడిపల్లి గ్రామస్తులకు, వినయ్కు మధ్య భూ వివాదం నెలకొంది. దీంతో పాతబస్తీకి చెందిన కొంత మందిని... మామిడిపల్లికి పంపించి, గ్రామస్తులపై దాడి చేయించారు. గ్రామస్తులపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలకు నిప్పంటించారు. దీంతో వినయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన 14 మందిని అరెస్ట్ చేశారు. A1 నిందితుడు డాక్టర్ వినయ్, A2 నిందితుడు శాశ్వత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com