సముద్రతీరంలో యువతి ఫై ముగ్గురు యువకుల సామూహిక హత్యాచారం..!
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల కిందట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల కిందట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సముద్ర తీరంలో ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు సముద్ర తీరానికి వచ్చిన ఓ యువతిని చెరపట్టిన యువకులు అత్యాచారం చేయడమే కాకుండా బాధితురాలి నగ్న ఫోటోలు తీశారు. పది రోజుల తర్వాత మళ్లీ కోరిక తీర్చాలని వేధించారు. సహకరించకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
ఉప్పలగుప్తం మండలంలోని ఓ యువతి బంధువుల వివాహానికి వచ్చింది. స్నేహితులతో కలిసి కొమరగిరిపట్నం గడదారి సముద్రతీరానికి వెళ్ళింది. అక్కడే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకుల కన్ను యువతి పైన పడింది. ఆమెను బంధించి సామూహిక అత్యాచారం చేశారు. అదే సమయంలో బాధితురాలి ఫోటోలు తీశారు పది రోజుల తర్వాత మళ్లీ కోరిక తీర్చాలని యువతి పై ఒత్తిడి పెంచారు.
నగ్న ఫోటోలు నెట్లో పెడతామని యవతిని బెదిరించారు. వీరి ఆగడాలు రోజురోజుకీ మితిమిరడంతో యువతి బంధువులకు చెప్పేసింది. వెంటనే వారు అల్లవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
RELATED STORIES
Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్ చుట్టుపక్కల దేశాలు.....
14 Aug 2022 4:00 PM GMTEgypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
14 Aug 2022 3:45 PM GMTImran Khan: భారత్పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..
14 Aug 2022 3:14 PM GMTSalman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTNorth Korea: కిమ్ జోంగ్ ఉన్కు తీవ్ర అనారోగ్యం: సోదరి వెల్లడి
11 Aug 2022 10:15 AM GMT