మైనర్‌ బాలికను మోసం చేసిన ప్రియుడు.. అబార్షన్‌ చేసిన తల్లి

మైనర్‌ బాలికను మోసం చేసిన ప్రియుడు.. అబార్షన్‌ చేసిన తల్లి

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. అయితే బాలికకు సొంత వైద్యం చేసి అబార్షన్‌ చేసేందుకు తల్లి యత్నించింది. అయితే నాటు వైద్యం వికటించి బాలిక సహా, శిశువు మృతి చెందింది. పైగా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాలను పూడ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు... రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పూడ్చిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story