Vikarabad Crime : ప్రేమించి మోసం చేశాడు.. అందుకే ఆ నిర్ణయం తీసుకుంది..!
Vikarabad Crime : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అతని ఇంటి వద్ద బ్లేడ్తో గొంతు కోసుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో జరిగింది. నవీన్ అనే యువకుడు హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అక్కడ పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. విషయం ఇంట్లో వాళ్లకూ తెలిసింది. ఐతే.. పెళ్లికి ఒప్పుకోవడానికి కట్నం అడగడంతో గొడవలు మొదలయ్యాయి.
వారం కిందట ECIL నుంచి ఊటుపల్లి వెళ్లిన దీప.. పెళ్లి విషయంపై మరోసారి నవీన్ను నిలదీసింది. తాను అత్తారింట్లోనే ఉంటానంటూ పట్టుబట్టింది. చివరికి సర్పంచ్ సహా మరికొందరి జోక్యంతో అమ్మాయికి నచ్చచెప్పి పంపించారు. నిన్న పెళ్లి మాటల సమయంలో కట్నం ప్రస్తావన వచ్చింది. 20 లక్షల కట్నం, 10 తులాల బంగారం ఇవ్వాలని అబ్బాయి తరపు వాళ్లు అడిగారని యువతి తల్లి చెప్తోంది. ఈ విషయంపై గొడవ పెద్దదవడంతో ఆవేశానికి గురైన దీప.. అక్కడున్న బ్లేడ్తో గొంతు కోసుకుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com