Mahabubabad: యువతి ఆత్మహత్య.. నలుగురు అత్యాచారం చేశారంటూ సూసైడ్ నోట్..

Mahabubabad: తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారన్న అవమాన భారంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన శ్రీ రాం సుప్రియ అనే యువతి ఒంటరిగా ఉంటోంది. తల్లి కొన్నాళ్ల క్రితం చనిపోగా.. తండ్రి ఉపాధి కోసం లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు.
ఒంటరిగా ఉంటున్న యువతిపై గ్రామానికి చెందిన నలుగురు లైంగిక దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక.. రెండు రోజుల క్రితం యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం హాస్పిటల్కు తరలించగా సూసైడ్ నోట్ రాసి ఇచ్చింది. తన చావుకు గ్రామానికి చెందిన సాగర్, సద్దాం, అజీమ్, జగదీశ్లేనని సూసైడ్ నోట్లో పేర్కొంది. నలుగురు వ్యక్తులతో పాటు ఓ ప్రజా ప్రతినిధి, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని తెలిపింది. చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయింది. సుప్రియ సూసైడ్కు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com