Guntur: పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఎస్సైపై ఫిర్యాదు

X
By - Vijayanand |21 May 2023 5:40 PM IST
గుంటూరు జిల్లా నగరపాలెం ఎస్సై రవితేజపై ఓ నర్సింగ్ స్టూడెంట్ ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని... నగరపాలెం పీఎస్లో ఫిర్యాదు చేసింది. తాడేపల్లి ఐద్వా కార్యకర్తలను కలిసిన యువతి....ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే.. గతంలోనూ మరో యువకుడిపైనా పట్టాభిపురంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రసన్నకుమార్ రెడ్డి అనే యువకుడు మోసం చేశాడంటూ గతంలో ఫిర్యాదు చేసింది. అయితే... అప్పట్లో ప్రైవేటు వ్యక్తుల వద్ద సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎస్సై రవితేజపైనా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై.. పూర్తి స్థాయిలో విచారణకు చేస్తున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com